Posts

Showing posts from September, 2022

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

Image
గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు         SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గము నందు సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ వెంకట అప్పారావు గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Dr. వెంకట శేషయ్య గారు అధ్యక్షత వహించారు.           ఆధునిక తెలుగు సాహిత్యంలో ధ్రువ తారగా ప్రకాశించిన నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు.  ఈయన దేశభక్తుడిగా భావకవిగా, సంఘసంస్కర్తగా,  నాటక కర్తగా, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడులను సృష్టించి తెలుగు జాతిని జాగృతం చేశారు.  అలాగే వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు బాట వేసినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఈయన ముత్యాల సరాలు అనే కొత్త చందస్సులో కొత్త కథా వస్తువులు, సాంఘిక అంశాలు తీసుకొని తెలుగు భాషకు ప్రాముఖ్యమిస్తూ, సహజ వర్ణనలతో రాయబడిన కవితలు అనేకం ఉన్నాయి.  అలాగే దిద్దుబాటు కథానిక లో వైవాహిక జీవిత సమస్యను, మీ పేరేమిటి కథ లో మతం పేరుతో జరిగే మోసాల్ని కళ్ళకు కట్టినట్లు తెలిపారు.  దేశభక్తి కవిత్వం...

అష్టావధానము

Image
తెలుగు విభాగం ఆధ్వర్యంలో అష్టావధానము   కళ్యాణదుర్గంలోని స్థానిక శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14-9-2022 సంవత్సరమున తెలుగు భాషావికాసం మరియు తెలుగువిభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి .జయరామరెడ్డి గారి అధ్యక్షతన అష్టావధాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.   ముందుగా తెలుగు అధ్యాపకులు శ్రీ ఎం పరమేష్ గారు, కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి . జయరామ రెడ్డి గారిని అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాన బాలభాస్కర బిరుదు పొందిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థి చిరంజీవి శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారిని మరియు జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు శ్రీ జి . ఎల్.ఎన్ ప్రసాద్ గారిని అలాగే తెలుగు భాషా వికాసం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.   అష్టావధానములో పాల్గొంటున్న ఎనిమిది మంది పృచ్చకులను కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది.   ఆ తర్వాత ముఖ్య అతిథి, కళాశాల అధ్యక్షులచే...