Posts

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

Image
  అంతర్జాతీయ మాతృభాషా  దినోత్సవం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ఫిబ్రవరి 21, 2023 న తెలుగు విభాగము ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అధ్యక్షతన, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని విద్యార్థులు ఆలపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి శేషయ్య గారు మాట్లాడుతూ మాతృభాషా అమృతం వంటిదని మనం పుట్టిన నాటి నుండే ఉగ్గుపాలతో పాటు, కన్నతల్లి మాతృభాషాను రంగరించి పోస్తుంది.  అందువల్లనే మాతృ భాషను తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలు నేర్చుకుంటూనే ఉంటామని తెలిపారు. అంతేకాకుండా వెయ్యి సంవత్సరాలుగా తెలుగు జాతి, వెయ్యి విధాలుగా పండించుకున్న సజీవ భాష తెలుగు భాషని తెలియజేశారు.  అలాగే తెలుగు భాష మాధుర్యాన్ని ఆస్వాదించిన ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడిన ఘనత అమ్మ భాషని తెలిపారు. అలాగే తెలుగు అధ్యాపకులు ఎం. పరమేష్ మాట్లాడుతూ కన్నతల్లి ,పుట్టిన గడ్డ ,స్వర్గం కంటే గొప్పవని వీటితో పాటు మాతృభాషా అయిన తెలుగు మహోన్నతమైనదని తెలుపుతూ, శిశువుకు తల్లిపాలు ఎలాంటివో విద్యార్థికి మా...

వేమన జయంతి

Image
Date: 19th January 2023. Kalyanadurgam. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి గారి అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో నేడు వేమన జయంతి ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ వేమన ప్రజాకవి ,తిరుగుబాటుకవి ,లోక కవి అని కూడా ప్రసిద్ధి చెందాడు.ప్రజల భాషలో' ప్రజల కోసం వేదాంతం చెప్పి ఆ తర్వాత సంఘసంస్కర్తలకు మార్గదర్శకుడు అయ్యాడు. అంతేకాకుండా తెలుగు కవిత్వాన్ని జానపదుల నాలుకలపై నాట్యం చేసిన మహనీయుడు యోగివేమన అని తెలియజేశారు .అలాగే నేడు వేమన పద్యాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఆటవెలది చందస్సు లో పద్యాలు రాసాడని తెలిపారు. పద్య పఠన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ బహుమతులు ప్రధానం చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి శేషయ్య గారు ,జంతు శాస్త్రl అధ్యాపకులు జి. ఎల్ .ఎన్ ప్రసాద్ గారు మరియు తెలుగు శాఖ అధ్యక్షులు ఎం. పరమేష్ ,తెలుగు అధ్యాపకులు వై. అంజన రెడ్డి మరియు కంప్యూటర్ అధ్యాపకులు ఎం. సుధాకర్ మరియు విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేశా...

సంగీతావధానం (Sangeeta Avadhanam)

Image
సంగీతావధానం స్థానిక కళ్యాణదుర్గంలోని శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 29-11-2022 సంవత్సరమున తెలుగు విభాగం మరియు తెలుగు భాషా వికాసం ఉద్యమం ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జయరామరెడ్డి గారి అధ్యక్షతన సంగీతావా దానం కార్యక్రమం కనుల పండుగ జరిగింది.   ఈ సాహితీ సభకు అవధానిగా ముఖ్య అతిథిగా కడప జిల్లా నుండి కవి గాయకుడు గౌరవనీయులు యలమర్తి మధుసూధన గారు హాజరయ్యారు.  ముందుగా తెలుగు విభాగాధిపతి గౌరవనీయులు శ్రీ ఎం పరమేష్ గారు ప్రిన్సిపల్ డాక్టర్ జయరామిరెడ్డి గారిని అలాగే అవధాని యలమర్తి మధుసూదన్ గారిని మరియు కళాశాల ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ ఎం వి శేషయ్య గారిని అలాగే జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు జి యల్ యన్ ప్రసాద్ గారిని తెలుగు భాషా వికాసం అధ్యక్షులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక పైకి ఆహ్వానించారు.   ఆ తర్వాత అవధాని గారిచే జ్యోతి ప్రజ్వలన పూర్తి అయిన తర్వాత విద్యార్థులచే మా తెలుగు తల్లి మల్లెపూదండ ప్రార్థన గేయాన్ని ఆలపించారు.   ఈ సాహితీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధ్యక్షులు మాట్లాడుతూ మన సంస్కృతి సంప...

గుర్రం జాషువా జయంతి

Image
గుర్రం జాషువా జయంతి కళ్యాణదుర్గంలోని ఎస్ వి జి ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయరాం రెడ్డి గారి అధ్యక్షతన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి జరిగింది.   ప్రిన్సిపల్ గారు సభను ఉద్దేశించి ఉపన్యసిస్తూ తెలుగు సాహిత్య రంగంలో తొలి తరం కవులలో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి గుర్రం జాషువా.వారిది రాపిడి పడ్డ జీవితం, ఆ రాపిడిలో రాణించిన ప్రతిభ  ఆ ప్రతిభలో గుబాలించిన కవిత, కులమత విద్వేషం బుల్ తలచూపుని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది గుర్రం జాషువా అని తెలిపారు.    కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వి. శేషయ్య గారు మాట్లాడుతూ గుర్రం జాషువా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని చిన్ననాటి నుండి ఎన్నో అవమానాలకు గురయ్యాడని ఈయన కవి కావటానికి అనుకూల పరిస్థితులు లేని వ్యవస్థను ఎదుర్కొని నిలబడి మహాకవిగా పేరు పొందాలని తెలిపారు.    తెలుగు విభాగం అధ్యాపకులు ఎం.పరమేష్ ఉపన్యసిస్తూ గుర్రం జాషువా జగమెరిగిన విశ్వ నరుడు.  తెలుగు సాహితీ ప్రపంచంలో మహా దార్శనికుడు తన సాహిత...

గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు

Image
గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలు         SVGM ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కళ్యాణదుర్గము నందు సెప్టెంబర్ 21వ తారీఖున గురజాడ వెంకట అప్పారావు గారి జన్మదిన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. Dr. వెంకట శేషయ్య గారు అధ్యక్షత వహించారు.           ఆధునిక తెలుగు సాహిత్యంలో ధ్రువ తారగా ప్రకాశించిన నవయుగ వైతాళికుడు గురజాడ వెంకట అప్పారావు.  ఈయన దేశభక్తుడిగా భావకవిగా, సంఘసంస్కర్తగా,  నాటక కర్తగా, తెలుగు సాహిత్యంలో కొత్త వరవడులను సృష్టించి తెలుగు జాతిని జాగృతం చేశారు.  అలాగే వాడుక భాషగా తెలుగు వికసించడానికి వెలుగు బాట వేసినటువంటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు. ఈయన ముత్యాల సరాలు అనే కొత్త చందస్సులో కొత్త కథా వస్తువులు, సాంఘిక అంశాలు తీసుకొని తెలుగు భాషకు ప్రాముఖ్యమిస్తూ, సహజ వర్ణనలతో రాయబడిన కవితలు అనేకం ఉన్నాయి.  అలాగే దిద్దుబాటు కథానిక లో వైవాహిక జీవిత సమస్యను, మీ పేరేమిటి కథ లో మతం పేరుతో జరిగే మోసాల్ని కళ్ళకు కట్టినట్లు తెలిపారు.  దేశభక్తి కవిత్వం...

అష్టావధానము

Image
తెలుగు విభాగం ఆధ్వర్యంలో అష్టావధానము   కళ్యాణదుర్గంలోని స్థానిక శ్రీ విరక్తి గవి మఠం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14-9-2022 సంవత్సరమున తెలుగు భాషావికాసం మరియు తెలుగువిభాగం సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి .జయరామరెడ్డి గారి అధ్యక్షతన అష్టావధాన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.   ముందుగా తెలుగు అధ్యాపకులు శ్రీ ఎం పరమేష్ గారు, కళాశాల అధ్యక్షులు డాక్టర్ డి . జయరామ రెడ్డి గారిని అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవధాన బాలభాస్కర బిరుదు పొందిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థి చిరంజీవి శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ గారిని మరియు జంతు శాస్త్ర అధ్యాపకులు గౌరవనీయులు శ్రీ జి . ఎల్.ఎన్ ప్రసాద్ గారిని అలాగే తెలుగు భాషా వికాసం అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ జగర్లపూడి శ్యామ్ సుందర్ శాస్త్రి గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది.   అష్టావధానములో పాల్గొంటున్న ఎనిమిది మంది పృచ్చకులను కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరిగింది.   ఆ తర్వాత ముఖ్య అతిథి, కళాశాల అధ్యక్షులచే...